సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. హర్యానా రాష్ట్రంలో కమల దళానికి ఊహించని షాక్ తగిలింది.
ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. కమలదళానికి టాటా చెప్పిన బీరేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
హర్యానాలో కమల దళానికి పార్టీ సీనియర్ నేత బీరేందర్ సింగ్ రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. బీరేంద్ర సింగ్ 2020లో ఎగువ సభ నుంచి రిజైన్ చేశారు. అయితే గత నెలలో బీరేందర్ కూమారుడు బ్రిజేంద్ర సింగ్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హిస్సార్ ఎంపీ అయిన బ్రిజేంద్ర సింగ్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వెల్లడించారు. బ్రిజేంద్ర తన ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి హిస్సార్ ఎంపీగా గెలిచారు.