ఎట్టకేలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది టీడీపీ. చివరి వరకు పట్టుబట్టిన చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి కళా వెంకటరావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావులకు చోటు దక్కింది.
వైసీపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి గుమ్మనూరు జయరామ్కు గుంతకల్లు నుంచి బరిలోకి దిగుతున్నారు. పాడేరు నుంచి కిల్లు వెంకటరమేష్ నాయుడు, దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్ సీటు లభించింది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చోటు కల్పించింది. అక్కడ ప్రభాకర్ చౌదరికి నిరాశే ఎదురైంది. అలాగే కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ బరిలో ఉండనున్నారు.
ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికొస్తే.. విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేశ్రెడ్డిలకు సీట్లు దక్కాయి.