ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అధికారులు సస్పెండ్..

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

 

కాగా ఇప్పటివరకు ఈ కేసులో ఎ1 గా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎ2 గా ప్రణీత్ రావు, ఎ3 గా రాధాకిషన్ రావు, ఎ4గా భుజంగరావు, ఎ5గా తిరుపతన్న ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న వీరిరువురి కస్టడీ ముగుస్తుంది.

 

తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ రవి గుప్తా వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :